Site icon TeluguMirchi.com

ప్రతినాయకుడి పాత్రలో కలెక్షన్ కింగ్..

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు..నటుడిగా..విలన్ గా..నిర్మాతగా ఇలా అన్ని పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం సినిమాల తగ్గించినప్పటికీ తాజాగా తమిళ్ హీరో సూర్య సినిమాలో నటిస్తున్నాడు. గురు సినిమాను డైరెక్ట్ చేసిన సుధ కొంగర డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో మోహన్ బాబు ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.

‘సూరరై పోట్రు’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సూర్యే నిర్మాత కావడం విశేషం. ఇక ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొనడానికి మోహన్‌బాబు చెన్నై వెళ్లారు. శుక్రవారం చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో జరిగే షూటింగ్‌లో ఆయన పాల్గొననున్నారు. మోహన్ బాబు కెరీర్‌లో ఇప్పటివరకూ ఆయన ఒకే ఒక్క లేడీ డైరెక్టర్‌తో సినిమా చేశారు. కృష్ణ నాయకుడిగా గతంలో విజయ నిర్మల దర్శకత్వంలో వచ్చిన ఓ సినిమాలో మోహన్‌బాబు ప్రతినాయకుడిగా నటించారు. మళ్లీ 40 ఏళ్ల తర్వాత ఆయన మరో లైడీ డైరెక్టర్‌ సుధ కొంగర దర్శకత్వంలో సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

Exit mobile version