మోహన్ బాబు లేడా..?

సైరా నరసింహ రెడ్డి తో యావత్ ప్రేక్షకులను ఆకట్టుకున్న మెగాస్టార్ చిరంజీవి..ప్రస్తుతం కొరటాల డైరెక్షన్లో తన 152 వ చిత్రం ఆచార్య చేస్తున్నాడు. ఈ చిత్రంలో చిరంజీవి డబుల్ రోల్ చేయబోతున్నాడని ప్రచారం జరుగుతుండగా.. సిద్దు.. ఆచార్య అనే రెండు విభిన్నమైన పాత్రల్లో చిరంజీవి కనిపించబోతున్నారని.. అందులో సిద్దు పాత్రలో చరణ్ కనిపించబోతున్నాడని అంటున్నారు.

ఇదిలా ఉంటె తాజాగా ఈ మూవీ లో విలన్ రోల్ కు గాను కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ను ఎంపిక చేశారనే వార్తలు వైరల్ కాగా… దీనిపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతున్నట్లు ఈ మూవీ లో మోహన్ బాబు నటించడం లేదు. ఆయన స్థాయికి తగ్గ పాత్ర ఈ సినిమాలో లేదు. ఒకవేళ అలాంటిది ఉంటె తప్పకుండ మీకు తెలియజేస్తాం అని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చారు. ఈ క్లారిటీ అభిమానులకు నిరాశ కలిపిస్తుంది. మొన్నటివరకు మోహన్ బాబు నటిస్తున్నాడేమో అని అంత సంబరాలు చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన నటించడం లేదని తెలిసి బాధ పడుతున్నారు. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీని మ్యాట్నీ మూవీస్ , చరణ్ కలిసి సంయుక్తం గా నిర్మిస్తున్నారు.