‘బాబా దేవుడు కాదంది’ బాధించింది!

Why-Mohan-Babu-walked-out-of-MAA-Awards--1837-

షిరిడీ సాయిబాబా దేవుడు కాదని, అసలు పూజించడం తప్పంటూ.. ద్వారకా పీఠాధిపతి శంకరాచార్య స్వామి స్వరూపానంద చేసిన సంచలన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సాయిబాబా భక్తులు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శంకరాచార్య వ్యాఖ్యలపై ప్రముఖ నటుడు మోహన్ బాబు స్పందించారు. “బాబు దేవుడు కాదన్న మాటలు నన్ను బాధించాయి. నేను చాలా కాలం నుంచి బాబా భక్తుడను. చాలా సార్లు షిరిడి వెళ్లాను. అక్కడ కన్నీళ్లు పెట్టుకున్నాను. బాబా దేవుడు కాదు.. మాంసం తినేవాడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమజసం కాదు. ముస్లింలో కూడా చాలా మంది బాబా భక్తులున్నాయి. ఒక మతం వారిని తక్కువ చేసి మాట్లాడటం మంచిదని కాదని మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, దేశంలో పలు చోట్ల శంకరాచార్య దిష్టిబొమ్మను బాబా భక్తులు దగ్ధం చేశారు.