గత కొన్ని రోజులుగా మోహన్ బాబు ఫై తరుచు ఏదో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. మొన్నటికి మొన్న తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా మోహన్ బాబు నియమితులు అవుతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం కావడం తో ఆ వార్తల్లో నిజం లేదని స్వయంగా మోహన్ బాబు తేల్చి చెప్పారు. దీంతో ఆ వార్తలు మళ్లీ రిపీట్ కాలేదు.
తాజాగా మోహన్ బాబు ఎఫ్డీసీ (ఫిలిం డెవలప్మెంట్ కార్పోరేషన్) చైర్మన్గా నియమించారన్న ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో అంత నిజమను కోవడం మొదలు పెట్టారు. అయితే ఈ వార్తలను మోహన్బాబు పీఆర్ టీం ఖండించారు. ఆ వార్తల్లో నిజం లేదన్న పీఆర్ టీం, ఏదైనా ఉంటే అధికారికంగా తెలియజేస్తాం అని తెలిపింది.
ప్రస్తుతం మోహన్ బాబు సినిమాల తగ్గించినప్పటికీ తాజాగా తమిళ్ హీరో సూర్య సినిమాలో నటిస్తున్నాడు. గురు సినిమాను డైరెక్ట్ చేసిన సుధ కొంగర డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో మోహన్ బాబు ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.