Site icon TeluguMirchi.com

రూమర్లను నమ్మకండి – మోహన్ బాబు

గత కొన్ని రోజులుగా మోహన్ బాబు ఫై తరుచు ఏదో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. మొన్నటికి మొన్న తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా మోహన్ బాబు నియమితులు అవుతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం కావడం తో ఆ వార్తల్లో నిజం లేదని స్వయంగా మోహన్ బాబు తేల్చి చెప్పారు. దీంతో ఆ వార్తలు మళ్లీ రిపీట్ కాలేదు.

తాజాగా మోహన్‌ బాబు ఎఫ్‌డీసీ (ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌) చైర్మన్‌గా నియమించారన్న ప్రచారం సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో అంత నిజమను కోవడం మొదలు పెట్టారు. అయితే ఈ వార్తలను మోహన్‌బాబు పీఆర్‌ టీం ఖండించారు. ఆ వార్తల్లో నిజం లేదన్న పీఆర్‌ టీం, ఏదైనా ఉంటే అధికారికంగా తెలియజేస్తాం అని తెలిపింది.

ప్రస్తుతం మోహన్ బాబు సినిమాల తగ్గించినప్పటికీ తాజాగా తమిళ్ హీరో సూర్య సినిమాలో నటిస్తున్నాడు. గురు సినిమాను డైరెక్ట్ చేసిన సుధ కొంగర డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో మోహన్ బాబు ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.

Exit mobile version