ఇండస్ట్రీ కి వచ్చి చాల ఏళ్ళు గడిచిన చెప్పుకో స్థాయిలో హిట్ మాత్రం కొట్టలేకపోయారు. విష్ణు అప్పుడప్పుడు కామెడీ కథలను నమ్ముకొని హిట్ కొడుతున్నాడు కానీ మనోజ్ పరిస్థితి మాత్రం చాల దారుణంగా ఉంది. అందుకే కొడుకులకు ఎలైన తన స్థాయి హిట్ ఇవ్వాలని మోహన్ బాబు కంకణం కట్టుకున్నాడు. తాజాగా మోహన్ బాబు – విష్ణు కాంబినేషన్ లో సేనాపతి గా మోహన్ బాబు రాబోతున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పై తెరకెక్కబోతుంది. ఇక మరో చిత్రం కూడా మోహన్ బాబు లైన్ లో పెట్టాడట. ఈ చిత్రం లో మనోజ్ తో నటిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలతో తనకొడుకులకు బ్లాక్ బస్టర్స్ ఇవ్వాలనే కసి తో ఉన్నాడు.