నిర్మాతగా ఏడుస్తున్నా : మోహన్ బాబు


పైరసీ భూతం సినీ పరిశ్రమను వెంటాడుతోంది. ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా పైరసీని ఆపడం సాధ్యపడటం లేదు. ఎంత అప్రమత్తంగా వుంటున్నా ఏదో మార్గంలో పైరసీ పట్టిపీడిస్తుంది.

తాజాగా ఈ అంశంపై మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. విడుదల రోజునే సినిమాల పైరసీకి పాల్పడుతున్న వారిని కూడా దేవుడు చల్లగా చూడాలని ఎద్దేవా చేసిన మోహన్ బాబు.. ఒక నిర్మాతగా ఏడుస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఎనిమిది మాసాలుగా ఎంతో శ్రమించి తీసిన సినిమా విడుదల మరుసటి రోజే ఆన్‌లైన్లో ప్రత్యక్షం కావడం తన మనసును కలిచివేసిందన్నారు. ప్రేక్షకులెవరూ పైరసీని ప్రోత్సహించొద్దని , సినిమాని కాపాడాలని కోరారు. ఆయన నటించిన గాయత్రి సినిమా పైరసీకి గురైన సంగతి తెలిసిందే.