Site icon TeluguMirchi.com

ఎం.ఎల్.ఎ సెన్సార్ రిపోర్ట్..

కళ్యాణ్ రామ్, కాజల్ జంటగా ఉపేంద్ర దర్శకత్వం లో తెరకెక్కిన మూవీ ఎం.ఎల్.ఎ. మార్చి 23 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యం లో ఈ చిత్ర సెన్సార్ కార్య క్రమాలు పూర్తి చేసుకుంది. చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ జారీ చేసారు. మొత్తం చిత్ర నిడివి రెండు గంటల తొమ్మిది నిమిషాలు ఉన్నట్లు తెలుస్తుంది.

కళ్యాణ్ రామ్ యాక్టింగ్ చాల కొత్తగా ఉంటుందని , కాజల్ , కళ్యాణ్ రామ్ ల మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలను అభిమానులు బాగా ఎంజాయ్ చేస్తారని అంటున్నారు. ఇక సినిమాలో బ్రహ్మానందం, పృద్వి , పోసాని కామెడీ హైలైట్ గా ఉండబోతుందని సెన్సార్ వారు చెపుతున్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించగా ప్రసాద్ మురెళ్ళ సినిమాటోగ్రఫి అందించాడు.

Exit mobile version