Site icon TeluguMirchi.com

‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ రిలీజ్ వాయిదా !


స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. వాస్తవానికి ఈ సినిమా ఆగష్టు 4న రిలీజ్ కావాలి. కానీ పోస్టు ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం కారణంగా ఆగస్టు 4వ తేదీన సినిమాను విడుదల చేయలేకున్నాం. రిలీజ్‍ను వాయిదా వేశాం. అన్‍లిమిటెడ్ ఫన్, ఎంటర్‌టైన్మెంట్‍తో అతి త్వరలో మీ ముందుకు వస్తాం. కొత్త రిలీజ్ డేట్, థియేట్రికలల్ ట్రైలర్ డేట్‍ను త్వరలో ప్రకటిస్తాం” అని యూవీ క్రియేషన్స్ ట్వీట్ చేసింది. దీంతో వెండితెరపై అనుష్క శెట్టిని మళ్లీ ఎప్పుడెప్పుడు చూద్దామా అని వేచిచూస్తున్న అభిమానులకు నిరాశే ఎదురైంది.

ఇకపోతే పి.మహేశ్ బాబు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో అనుష్క తో పాటు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నటిస్తున్నాడు. వీరిద్దరి మధ్య ఉన్న వయస్సు అంతరంతో పాటు విభిన్న వృత్తుల మధ్య జరిగిన స్టోరీ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు.

Exit mobile version