Site icon TeluguMirchi.com

సందీప్‌ కిషన్‌‌కు హైదరాబాద్ మెట్రో షాక్ !

హీరో సందీప్ కిషన్ నటిస్తున్న తాజా చిత్రం నిను వీడని నీడని నేనే. ఈ సినిమా రేపు విడుదల కానుంది . ఈ నేపధ్యంలో ఈ సినిమాకి మెట్రో పెద్ద షాక్ ఇచ్చింది. సినిమా ప్రమోషన్ లో భాగంగా మెట్రో పిల్లర్ పై సినిమా పోస్టర్ లను ఏర్పాటు చేసారు. కానీ ఇవి చూడడానికి అసభ్యకరంగా ఉన్నాయని పలువురు మెట్రో అధికారులకు ఫిర్యాదు చేశారు. వాళ్లు సదరు పోస్టర్స్ చూసి వెంటనే వాళ్ల పై అధికారులకు కంప్లైట్ చేసారు. దీంతో మెట్రో అధికారులు అ పోస్టర్ లను తొలిగించాలని ఆదేశించారు.

దీంతో జీహెచ్‌ఎంసీ స్థానిక పోలీసుల సహకారంతో మెట్రో పిల్లర్ల వెంట ఉన్న ఈ సినిమా పోస్టర్స్‌ను తొలిగించారు. దీనిపై సినిమా నిర్మాతలు నిర్మాతలు ఎంతో డబ్బులు పోసి ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నాము. ఇలా ప్రమోట్ చేయడానికి హైదరాబాద్ మెట్రోతో పాటు జీహెచ్ఎంసీకి డబ్బులు కూడా చెల్లించాము. సినిమా విడుదలకు దగ్గర పడుతున్న ఈ సమయంలో హైదరాబాద్ మెట్రో తమ పోస్టర్స్ చించడం ఏమీ బాలేదని అంటున్నారు.

Exit mobile version