ప్రతి ఏటా సైమా (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) అవార్డ్స్ వేడుక అట్టహాసంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలకు గాను ఈ అవార్డ్స్ అందజేస్తుంటారు. వివిధ కేటగిరీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటులకు అవార్డులను ప్రదానం చేయడం ఆనవాయితీ. ఈ ఏడూ కూడా ఈ అవార్డ్స్ వేడుకకు సైమా సిద్దమయ్యింది.
ఈసారి ఖతర్లోని దోహలో ఈ వేడుక జరగనుంది. ఆగస్ట్ 15, 16 తేదీలలో జరగనున్న ఈ కార్యక్రమాలనికి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలకి చెందిన పలువురు సినీ సెలబ్రిటీలు హాజరు కానున్నారు. 15వ తేదీ తెలుగు, కన్నడ సినిమాలకి సంబంధించిన అవార్డులు కార్యక్రమం జరగనుండగా, ఆ రోజు మెగాస్టార్ చిరంజీవి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. ఇక 16వ తేదీన తమిళ, మలయాళ చిత్రాలకు సంబంధించిన అవార్డుల వేడుక జరపనుండగా ఆ రోజు మాలీవుడ్ మెగాస్టార్ మోహన్ లాల్ ముఖ్య అతిధిగా హాజరు కాబోతున్నారు. ఇంకో విశేషం ఏంటి అంటే ఆగస్ట్ 15 న చిరంజీవి నటిస్తున్న సైరా చిత్ర ట్రైలర్ ఈ వేదిక ఫై విడుదల చేస్తున్నట్లు సమాచారం.