ప్రతిష్టాత్మక నిర్వహించే కాన్స్ మూవీ ఫెస్టివల్ లో మెగాస్టార్, కేంద్ర మంత్రి చిరంజీవి సతీసమేతంగా పాల్గొన్నారు. ఈ వేడుక లో చిరు దంపతులతో పాటు చరణ్ ఉపాసనలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసిన ఫోటో లో మెగా ఫ్యామిలీ తో బాలీవుడ్ నటి విద్యా బాలన్ కూడా సందడి చేసింది.
ప్రపంచ సినిమాకు భారతదేశం నుంచి సహాయ సహకారాలు, భారతీయ సినిమా పురోగతి వంటి విషయాలను ‘ఇన్ క్రెడిబుల్ ఇండియా’ పేరిట ప్రపంచ దేశాలకు తెలియజెప్పేందుకు మన దేశం నుంచి ఓ టీం కాన్స్ మూవీ ఫెస్టివల్ కు బయలుదేరింది. ఈ టీంకు మెగా స్టార్ చిరు నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.