అందం, అణకువ కలబోసిన కథానాయిక పాత్రలతో ఆకట్టుకొంది మీరా జాస్మిన్. తొలిసారి ఓ థ్రిల్లర్ తరహా చిత్రంలో నటించింది. అదే మోక్ష. శ్రీకాంత్ వేములపల్లి దర్శకత్వం వహించారు. పి. అమర్నాథ్ నిర్మాత. ఈ చిత్రంలోని గీతాలు ఆదివారం రాత్రి హైదరాబాద్లో విడుదలయ్యాయి. నిజానికి ఈ సినిమా ఎప్పుడో పూర్తయింది. కానీ ఆర్థిక పరమైన కారణాల వల్ల ఇంతకాలం ల్యాబుల్లోనే మగ్గింది. ఎట్టకేలకు ఈ సినిమాని బయటకు తీసుకొస్తున్నారు. ఛార్మికి మంత్ర ఎలాగో… మీరాకి మోక్ష అలాగ.. అని ఈ చిత్రబృందం నమ్మకంతో చెబుతోంది. త్వరలోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. అందంతో ఆకట్టుకొన్న మీరా.. భయపెట్టే పాత్రలో ఎలా ఒదిగిపోయిందో చూడాలి.