వెంకటేష్, రామ్ కథానాయకులుగా నటించిన చిత్రం మసాలా. బాలీవుడ్ లో హిట్ కొట్టిన బోల్బచ్చన్కి రీమేక్ ఇది. విజయ్భాస్కర్ కె. దర్శకుడు. అంజలి, షాజన్పదమ్సీ కథానాయికలు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని గీతాలు ఇటీవలే విడుదలయ్యాయి. ఈ చిత్రాన్ని నవంబరు 1న విడుదల చేద్దామనుకొన్నారు. అయితే ఆ రోజు మసాలా రావడం అనుమానమే. నవంబరు 8న ఈ సినిమా తీసుకొస్తారట. థియేటర్లు అందుబాటులో లేకపోవడం వల్లే… ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలిసింది. ఇటీవల నానక్రామ్ గుడాలో చిత్రీకరించిన టైటిల్ పాటతో షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం రీరికార్డింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.