Site icon TeluguMirchi.com

గీతా ఆర్ట్స్ చిత్రానికి మారుతి డైరెక్షన్

“ఈ రోజుల్లో ” చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయి ఆ సినిమా హిట్ తర్వాత , తాజాగా బెల్లంకొండ  సురేష్ నిర్మాతగా ” బస్ స్టాప్ ” చిత్రానికి దర్శకత్వం వహించిన మారుతికి ప్రముఖ నిర్మాణ సంస్థ  గీతా ఆర్ట్స్ సంస్థలో అవకాశం దక్కింది. మూడవ చిత్రంగా మారుతి.. గీతా ఆర్ట్స్ సంస్థకు డైరెక్షన్ చేసే  అవకాశాలు వున్నాయి. నిర్మాత అల్లు అరవింద్ స్వయంగా మారుతీ ని పిలిచి ఈ ఆఫర్ ఇచ్చినట్టు  తెలిసింది. ఇదే నిజమైతే మారుతి బంపర్ ఆఫర్ కొట్టినట్లే. కాని ‘ ఈ రోజుల్లో ‘ ‘ బస్ స్టాప్ ‘ చిత్రాలు రెండూ  అశ్లీలంగా, ద్వందార్ధ సంభాషణలతో నిండి వున్నాయని పేరొచ్చింది. సినిమా విజయానికి మారుతి  బూతు మార్గాన్ని ఎంచుకుంటున్నారని ఇప్పటికే పేరొచ్చింది. మరి పూర్తి కుటుంబకథా చిత్రాలను నిర్మించటం ఆనవాయితీగా పెట్టుకున్న గీతా ఆర్ట్స్ సంస్థ మారుతి నుంచి ఎలాంటి చిత్రాన్ని ఆశిస్తోందో, ఏ తరహా సినిమాను నిర్మిస్తుందో వేచి చూడాల్సిందే..

Exit mobile version