టాలీవుడ్ మన్మథుడు కింగ్ అక్కినేని నాగార్జున మెయిన్ రోల్ లో నటిస్తున్న సినిమా ‘మన్మథుడు 2’. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.
కాగ ఈ సినిమా కొత్త పోస్టర్ను చిత్రబృందం తాజాగా రిలీజ్ చేసింది. పోస్టర్లో నాగ్ ఫ్రస్ట్రేషన్తో ఉంటే ఆయన్ని చూస్తూ రకుల్, లక్ష్మి, ఝాన్సీ నాయికామణులు నవ్వులు చిందిస్తున్నారు. మరి.. వెన్నెల కిశోర్, కీర్తి సురేశ్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాలో అక్కినేని కోడలు సమంత గెస్ట్ రోల్ పోషించారు. ఈ మధ్య చిత్ర టీజర్ను విడుదల చేశారు.
అయితే చైతన్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్, వయాకామ్ 18 స్టూడియోస్, ఆనంది ఆర్ట్స్ అఫీషియల్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అలాగే.. ఆగస్ట్ 9న ఈ సినిమా రిలీజ్ కానుంది.