మన్మధుడు 2 టీజర్ అప్డేట్

కింగ్ నాగార్జున – రకుల్ ప్రీతి సింగ్ జంటగా..సమంత , కీర్తి సురేష్ , అక్షయ ప్రముఖ పాత్రల్లో నటిస్తున్న చిత్రం మన్మధుడు 2 . 2002 లో వచ్చిన ‘మన్మథుడు ’ చిత్రానికి సీక్వెల్ గా రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఈ చిత్రం ఉండగా.. ఫస్ట్ లుక్ టీజర్ ను మధ్యాహ్నం ఒంటిగంటకు విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించారు. అలాగే.. ఓ ఆసక్తికరమైన పోస్టర్‌ను కూడా విడుదల చేసారు. పేకాటలోని కింగ్ కార్డుపై యానిమేటెడ్‌ లుక్‌లో నాగార్జున ఉండేలా డిజైన్‌ చేసిన ఈ పోస్టర్‌ ఆకట్టుకుంటోంది.

ఇక మొన్నటి వరకు విదేశాల్లో షూటింగ్ జరుపుకున్న చిత్ర యూనిట్..ప్రస్తుతం హైదరాబాద్ లో షూటిం జరుపుతున్నారు. నాగార్జున అక్కినేని, పి. కిరణ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా .. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. మరి ఈ చిత్రం మన్మధుడు చిత్రాన్ని మించేలా ఉంటుందని అభిమానులు అంచనాలు పెట్టుకుంటున్నారు. ఆలా ఉంటుందా లేదా అనేది రిలీజ్ అయితే గానీ తెలుస్తుంది.