మంచు హీరోలు ఒక్కటయ్యారు. మోహన్బాబు, విష్ణు, మనోజ్లు కలిసి వెండి తెరపై సందడి చేయబోతున్నారు. లక్ష్యం చిత్రంతో దర్శకుడిగా పేరు తెచ్చుకొన్న శ్రీవాస్ ఈ సినిమాని టేకప్ చేస్తున్నారు. ఈ చిత్రం ఆదివారం ఉదయం హైదరాబాద్లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి దాసరి నారాయణరావు క్లాప్నిచ్చారు. కె.రాఘవేంద్రరావు స్విచ్చాన్ చేశారు. అనంతరం మోహన్బాబు మాట్లాడుతూ ”హీరోగా నటించి చాలాకాలం అయ్యింది. ఇటీవల చిన్ని చిన్ని పాత్రలు చేశా. పూర్తి స్థాయి సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. ఓ సూపర్ హిట్ హిందీ సినిమాని రీమేక్ చేస్తున్నాం. కథ బాగా వచ్చింది. కోనవెంకట్, రవి, గోపీమోహన్ మంచి స్క్రిప్టు సిద్ధం చేశారు. ఈ చిత్రానికి నలుగురు సంగీత దర్శకులు పనిచేయడం విశేషం” అన్నారు. మే చివరి వారంలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభిస్తారు. వరుణ్ సందేశ్, తనీష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో రవీనాఠాండన్, హన్సిక, ప్రణీత కథానాయికలు.