సినిమాలకు గుడ్ బై చెప్పిన మంచు మనోజ్

మంచు మనోజ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై ఎలాంటి సినిమాలు చేయబోనంటూ అందరికీ షాకిచ్చారు. ప్రస్తుతం మనోజ్‌ ‘ఒక్కడు మిగిలాడు’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా కాకుండా ఆయన మరో చిత్రంలో నటించాల్సి ఉంది. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక ఇక ఎలాంటి సినిమాలూ ఒప్పుకోనని ప్రకటించాడు మనోజ్‌

‘ఒక్కడు మిగిలాడు, మరో చిత్రంలో నటిస్తున్నాను. ఈ రెండే ఓ నటుడిగా నా ఆఖరి చిత్రాలు. అందరికీ ధన్యవాదాలు’ అని ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌ చేశాడు మనోజ్. అయితే మనోజ్‌ ఉన్నట్టుండి ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో మాత్రం వెల్లడించలేదు. యువ హీరోగా దూసుకుపోతున్న మనోజ్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకునన్నాడో అర్ధం కావడం లేదు. .