దూసుకెళ్తాలో ల‌క్ష్మీ ప్రస‌న్న

manchu-lakshmiమంచు విష్ణు క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం దూసుకెళ్తా. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప‌తాకంపై మోహ‌న్‌బాబు నిర్మిస్తున్నారు. వీరు పోట్ల ద‌ర్శకుడు. చిత్రీక‌ర‌ణ ముగింపు ద‌శ‌కు వ‌చ్చింది. ఈ సినిమాలో మంచు ల‌క్ష్మీ ప్రస‌న్న ఓ అతిథి పాత్రలో క‌నిపించ‌నుంది. ఆమెపై గురువారం నుంచి సన్నివేశాల‌ను తెర‌కెక్కిస్తారు. ఈ స‌న్నివేశాల‌కు కె.రాఘ‌వేంద్రరావు, దాస‌రి నారాయ‌ణ రావు గౌర‌వ ద‌ర్శక‌త్వం వ‌హించ‌నున్నారు. “ఇదేదో కావాల‌ని ప‌ని గ‌ట్టుకొని సృష్టించిన పాత్ర కాదు. క‌థ‌కు చాలా కీలకం. అందుకే న‌టిస్తున్నా..“ అని మంచు ల‌క్ష్మీ ప్రస‌న్న చెబుతోంది. ఈ స‌న్నివేశాల‌తో చిత్రీక‌ర‌ణ పూర్తవుతుంది. అక్టోబ‌రు 11న ద‌స‌రా సంద‌ర్భంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.