మంచు లక్ష్మీ ప్రసన్న త్వరలో రాజకీయాల్లోకి రానుందా? జగన్ పార్టీ తీర్థం అందుకోనుందా? లేదంటే బీజేపీకి అనుకూలంగా ప్రచారం చేస్తుందా? గత కొన్ని రోజుల నుంచీ ఈ విషయం మీద ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఇటీవల గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ హైదరాబాద్ వచ్చినప్పుడు మంచు కుటుంబం ప్రత్యేకంగా మెడీని కలుసుకొన్నారు. ఆ సందర్భంలో లక్ష్మీ ప్రసన్నలోకి వాక్ చాతుర్యం ఆయన్ని ఆకట్టుకొంది. అంతేకాదు.. లక్ష్మీ ప్రసన్న ట్విట్టర్ని ఆయన కూడా ఫాలో అవుతున్నారు. మోడీని అనేక సందర్భాల్లో మెచ్చుకొంటూ లక్ష్మీప్రసన్న ట్విట్ కూడా చేస్తోంది. కొంతకాలం నుంచీ జగన్ నామ స్మరణ చేసింది. మొన్నామధ్య మోహన్బాబు, విష్ణు జైలులో ఉన్న జగన్ని సైతం కలిసొచ్చారు. జగన్ జైలు నుంచి విడుదల అవుతున్నాడని తెలిసి.. ఆయన్ని అభినందించింది. దాంతో మంచు వారి అమ్మాయి రాజకీయ రంగ ప్రవేశం గురించిన చర్చ మరింత జోరు అందుకొంది. కానీ ఇప్పుడు లక్ష్మీ ప్రసన్న తన మనసులోని మాటని స్పష్టంగా చెప్పింది. “రాజకీయాల్లోని రాను…“ అనేసింది. అయితే తన మద్దతు మాత్రం నరేంద్ర మోడీకి ఉంటుందని స్పష్టం చేసింది.