తెలుగులో మరో ఆసక్తికరమైన కాంబినేషన్ రాబోతోంది. `మనం`లో అక్కినేని ఫ్యామిలీ హీరోలు ముగ్గురు కలిసి ముందుకొస్తుంటే… ఇప్పడు మంచు ఫ్యామిలీ కూడా అదే దారిన వెళ్తోంది. మోహన్బాబు, విష్ణు, మనోజ్.. ఈ ముగ్గురూ ఒకే సినిమాలో కనువిందు చేయబోతున్నారు. విష్ణు, మనోజ్ ఈ చిత్రానికి నిర్మాతలకుగా వ్యవహరిస్తారు. లక్ష్యం సినిమాతో హిట్ కొట్టిన నివాస్ దర్శకత్వం వహిస్తారు. అంతేకాదు… వరుణ్ సందేశ్, తనీష్లాంటి యువ కథానాయకులూ ఈ సినిమాలో నటిస్తున్నారు. రవీనా టాండన్, హన్సిక, ప్రణీతలు కథానాయికలుగా ఎంపికయ్యారు. ఈక్రేజీ ప్రాజుక్టుకు గోపీ మోహన్, కోన వెంకట్, బీవీఎస్ రవి రచయితలుగా పనిచేస్తున్నారు. ఈనెల 21న ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభం కానుంది.