ఈమధ్యే 90వ యేట అడుగుపెట్టారు అక్కినేని నాగేశ్వరరావు. ఈ సందర్భంగా మంచు మోహన్బాబు – విష్ణు అక్కినేనికి ఓ ప్రత్యేక మైన కానుక అందించారు. అదో చిత్ర పటం. నాలుగు అడుగుల పొడవు, పద్దెనిమిది అడుగుల వెడల్పూ ఉన్న ఈ చిత్ర పటంలో అక్కినేని సినిమా చిత్రాలను పొందు పరచారు. దూరం నుంచి చూస్తే ఈ పటంలో మహా విష్ణువు, శ్రీరాముడు కనిపిస్తారు. ఆ సందర్భంగా అక్కినేని నాగేశ్వరరావు మాట్లాడుతూ ”మోహన్బాబు అభిమానానికి కృతజ్ఞుడిని. ఈ పటం గురించి నాకు ముందే చెప్పాడు. దీన్ని రూపొందించిన రమేష్కు నా అభినందనలు“అన్నారు. “తెలుగు సినిమాకి అక్కినేని, ఎన్టీఆర్ రెండు కళ్లు. వాళ్లతో కలసి పనిచేయడం నా అదృష్టం” అని మోహన్బాబు చెప్పారు. ఈ కార్యక్రమంలో విష్ణు, సుమంత్లు కూడా పాల్గొన్నారు.