Site icon TeluguMirchi.com

‘మనమంతా’ సాటిలైట్ రైట్స్ దుమ్ములేపాయి.

Manamantha-Satellite-rights‘ఐతే’ చిత్రం తో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ చంద్రశేఖర్‌ యేలేటి. తాజాగా ‘మనమంతా’ అంటూ నలుగురి మధ్య సాగే ఫ్యామిలీ కథ ను ఎంచుకొని గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మలయాళ నటుడు మోహన్ లాల్ , గౌతమీ ప్రధాన పాత్రలలో నటించగా సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు.

మొదటి షో తోనే పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడం , సినీ ప్రముఖులు సైతం సినిమా బాగుందని కితాబు ఇవ్వడం తో విడుదలయిన అన్ని చోట్ల మంచి కలెక్షన్స్ తో రన్ అవుతుంది. ఇక ఈ చిత్ర సాటిలైట్ రైట్స్ కూడా భారీ రేటుకు అమ్ముడుపోయాయని తాజా సమాచారం. తెలుగు, మళయాలం రెండు భాషలకు కలుపుకొని 6.80 కోట్ల రూపాయలకు మా టీవీ వారు కొనుగోలు చేసారు. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు ఈ లెవల్లో సాటిలైట్ బిజినెస్ జరగడం తో నిర్మాత సాయి కొర్రపాటి ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.

Exit mobile version