అక్కినేని ఫ్యామిలీ హీరోలు అందరూ కలసి నటిస్తున్న చిత్రం ‘మనం’. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తోంది. సమంత, శ్రియ కథానాయికలు. ‘మనం’ ఎఎన్ఆర్ చివరి సినిమా కావడంతో ఎంతో ప్రత్యేకంగా తీసుకున్న నాగార్జున ఈ సినిమాని అభిమానులకు సంథింగ్ స్పెషల్ గా అందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకి సంబందించిన మేకింగ్ వీడియోస్ ని స్వీట్ మెమొరీస్ గా అందించనున్నారు. అందులో మొదటి మెమొరీని రేపు రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమా ఫస్ట్ ట్రైలర్ ని శ్రీరామనవమి కానుకగా ఏప్రిల్ 8న రిలీజ్ చేయనున్నారు. మే రెండో వారంలో చిత్రాన్ని విడుదల చేయనున్నారు.