విడుద‌ల‌కు ముందే చూపిస్తార‌ట‌!

manam
అక్కినేని వంశంలోని మూడు త‌రాల వార‌సులు క‌ల‌సి న‌టించిన చిత్రం మ‌నం. నాగేశ్వ‌ర‌రావు, నాగార్జున‌, నాగ‌చైత‌న్య క‌ల‌సి న‌టించారు. విక్ర‌మ్ కె.కుమార్ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రాన్ని ఈనెల 23న విడుద‌ల చేస్తున్నారు. అంత‌కంటే ముందు 22న హైద‌రాబాద్‌లో అభిమానుల కోసం ప్ర‌త్యేక ప్ర‌ద‌ర్శ‌న‌లు నిర్వ‌హించ‌బోతున్నారు. అక్కినేని అభిమానుల కోసం 22వ తారీఖున ప్ర‌సాద్ ఐమాక్స్‌లో మ‌నం సినిమాకి ప్ర‌త్యేకంగా ప్ర‌ద‌ర్శించ‌బోతున్నారు. ప్ర‌సాద్ ఐమాక్స్‌లోని ఐదు స్ర్కీన్‌ల‌ను మ‌నం కోసం బుక్ చేసేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న అక్కినేని అభిమానుల్ని ఈ ప్ర‌ద‌ర్శ‌న‌కు ప్ర‌త్యేకంగా ఆహ్వానిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఈనెల 23న మ‌నం విడుద‌ల అవుతుంటే ఓవ‌ర్సీస్ లో మాత్రం.. బొమ్మ 22నే ప‌డిపోతోంది.