మార్చి లో ‘మనం’

manamఅక్కినేని ఫ్యామిలీ హీరోలు అందరూ కలసి నటిస్తున్న చిత్రం ‘మనం’. విక్రమ్ కుమార్ దర్శకుడు. టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం మైసూర్లో షూటింగ్ జరుపుకుంటుంది. నాగర్జున, శ్రియలపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ చిత్రం షూటింగ్లో ఉండగానే అక్కినేని అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. ట్రీట్ మెంట్ తీసుకున్న తర్వాత షూటింగ్లో పాల్గొన్న ఆయనపై వచ్చే సన్నివేశాలను పూర్తి చేసారు. డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి.మైసూర్ షెడ్యూల్ తో 90% షూటింగ్ పూర్తవతుంది. అన్ని పనులు వేంగంగా జరుగుతున్నా ఈ చిత్రం ను మార్చి లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తునట్టు నిర్మాత, హీరో నాగార్జున వెల్లడించారు. ఫస్ట్ లుక్ లోనే మాంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రం విడుదలైన తర్వాత ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.