సూపర్ స్టార్ అనగానే మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అనుకోకండి..మీము చెప్పేది మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి గురించి..మలయాళం లో సూపర్ స్టార్ అనిపించుకున్న మమ్ముట్టి ..తెలుగులో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో యాత్ర సినిమాలో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ప్రస్తుతం ఈయన భారీ పీరియడ్ డ్రామా మమాంగం అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో మమ్ముట్టి కేరళ సంప్రాదాయ యుద్ధవీరుడిగా కనిపించనున్నారు. ప్రాచీ తెహ్లన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలోఉన్ని ముకుందన్, అను సితార, మాళవికా మీనన్లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
17వ శతాబ్ధం నాటి కథతో తెరకెక్కుతున్న ఈ చిత్ర తొలి షెడ్యూల్ సంజీవ్ పిళ్ళై దర్శకత్వంలో తెరకెక్కగా, రెండో షెడ్యూల్ ఎం పద్మకుమార్ దర్శకత్వంలో రూపొందనుంది. మామాంగం అనే పండుగ సందర్బంగా జరిగే వివాదం నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందట. తాజాగా చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో యుద్ధవీరుడిగా మమ్ముట్టి లుక్ ఆకట్టకునేలా ఉంది.