Site icon TeluguMirchi.com

న‌రేష్‌, ప‌విత్రా లోకేష్ ‘మళ్ళీ పెళ్లి’ వాయిదా..


సీనియ‌ర్ న‌టుడు న‌రేష్, న‌టి ప‌విత్రా లోకేష్ క‌లిసి న‌టిస్తోన్న చిత్రం ‘మళ్ళీ పెళ్లి’. చిత్ర పరిశ్రమలో నటుడిగా నరేష్ 50 వసంతాలు పూర్తైన సందర్భంలో ఈ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. తెలుగు-కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ ద్విభాషా చిత్రానికి మెగా మేకర్ ఎంఎస్ రాజు దర్శకత్వం వహించగా, విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై నరేష్ స్వయంగా నిర్మిస్తున్నారు.

ఇకపోతే ‘మళ్ళీ పెళ్లి’ టీజర్ ను ఈ రోజు(ఏప్రిల్ 13) విడుదల చేయాలని ప్లాన్ చేశారు మేకర్స్. అయితే… సాంకేతిక కారణాలతో వాయిదా వేసినట్లు తెలిపారు. త్వరలో టీజర్ విడుదల చేయబోయే కొత్త తేదీ చెబుతామని పేర్కొన్నారు. కాగా జయసుధ, శరత్‌బాబు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నాడు. ‘మళ్ళీ పెళ్లి’ సినిమా ఈ వేసవిలోనే విడుదల కానుంది.

Exit mobile version