పూరి జగన్నాథ్లా క్రిష్ కూడా బాలీవుడ్ బాట పట్టాడు. అక్కడ ఠాగూర్ రీమేక్లో బిజీగా ఉన్నాడు. దాంతో మహేష్బాబుతో చేయాల్సిన శివం గందరగోళంలో పడింది. ఆ సినిమా ఉంటుందా? లేదా? అని మహేష్ అభిమానులు అందోళనలో పడ్డారు. శివం సినిమా ఉండదని… ఆ సినిమా అటకెక్కడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే మహేష్ సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ తరవాత శ్రీనువైట్ల సినిమా మొదలవుతుంది. క్రిష్ హిందీ ఠాగూర్ నవంబరులో మొదలవుతుంది. ఈలోగా శ్రీను వైట్ల సినిమా పూర్తయ్యే అవకాశాల్లేవు. అందుకే శివం సినిమా ఉండదని టాక్. అయితే క్రిష్ మాత్రం మహేష్తో ఎట్టిపరిస్థితుల్లోనూ సినిమా చేస్తా.. అంటున్నాడు. ఈ విషయాన్ని ట్విట్టర్లో కూడా పేర్కొన్నాడు. అవసరమైతే ఠాగూర్, శివం ఒకే సమయంలో తెరకెక్కిస్తాడట. చూద్దాం.. ఏం జరుగుతుందో?