బండ్ల గణేష్ తాజాగా తన బ్యానర్పై రూపొందించబోయే చిత్రానికి సంబంధించి ‘టపోరి’ అనే టైటిల్ని ఎపి ఫిల్మ్ ఛాంబర్లో రిజిస్టర్ చేసారు. తన పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్పై రిజిస్టర్ చేసిన ఈ టైటిల్ ఇప్పటికే ప్రిన్స్ మహేష్ అభిమానుల్లో కలకలం రేపుతోంది. కాగా పూరీ జగన్నాధ్ కోసం ఈ టైటిల్ని రిజిస్టర్ చేసినట్లు మరో ప్రక్క వినపడుతోంది. పూరీ కోసమైతే అది ఖచ్చితంగా మహేష్ కోసమే అయ్యింటుందని అంటున్నారు. పూరీ, బండ్ల గణేష్ కాంబినేషన్లో మహేష్ హీరోగా ఓ చిత్రం రూపొందనున్నట్లు తెలుస్తోంది. దాంతో ఈ టైటిల్ రిజిస్టర్ చేయటంతో అందరిలో ఆసక్తి మొదలైంది. ప్రస్తుతం పూరి ‘ఇద్దరమ్మాయిలు తో’ బిజీగా వున్నాడు. ఈ సినిమా షూటింగ్ బ్యాంకాక్ లో జరుగుతోంది. కాగా మహేష్.. సుకుమార్ సినిమాతో బిజీగా వున్నాడు. అయితే టపోరి ఖచ్చితంగా ఎవరికనేది ఇంకా తేలాల్సివుంది.