పివిపి ఫై సీరియస్ అయినా మహేష్..

pvp-mahesh-filmమహేష్ బాబు ఇటీవల బ్రహ్మోత్సవం చిత్ర ప్రొడ్యూసర్ పివిపి ఫై సీరియస్ అయ్యాడనే వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్ పుట్టిన రోజు సందర్బంగా పివిపి సంస్థ తమ బ్యానర్ లో మహేష్ నెక్స్ట్ మూవీ చేస్తున్నాడని ఓ పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దాంతో మహేష్ అభిమానులు సంబరపడ్డారు. కానీ ఆ పోస్టర్ గురించి మహేష్ కు ఏమీ చెప్పకుండా రిలీజ్ చేసాడట పివిపి. దాంతో మహేష్ పివిపి మీద సీరియస్ అయ్యాడట.

ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వం లో చేస్తున్న చిత్ర షూటింగ్ తో బిజీగా వున్నాడు మహేష్. ఈ చిత్రం పూర్తి కాగానే వంశీ పైడిపల్లి దర్శకత్వం లో సినిమా చేస్తాడని తెలుస్తుంది..