మ‌హేష్ ఉన్నాడా? లేడా?

Mahesh-babuఅత్తారింటికి దారేదిలో స్పెష‌ల్ ప్యాకేజీ ఉంది. మ‌రి ఆ ప్యాకేజీ కింద ఏ హీరో క‌నిపిస్తాడా?? అనేదే సస్పెన్స్! ఈ సినిమాలో మ‌హేష్‌బాబు అతిథి పాత్రలో క‌నిపిస్తాడ‌ని చెప్పుకొన్నారు. ఆ త‌ర‌వాత ప్రభాస్ వాయిస్ ఓవ‌ర్ ఇచ్చాడ‌ని అన్నారు. అయితే.. చిత్రబృందం ఈ విష‌యంపై స్పష్టంగా ఏమీ చెప్పడం లేదు. గ‌త కొన్ని రోజులుగా అత్తారింటికి దారేదిలో మహేష్ క‌నిపించ‌డం ఖాయ‌మ‌నే ప్రచారం జ‌రుగుతోంది. ఆడియో విడుద‌ల రోజున‌… ఎలాంటి క్లూ దొర‌క‌లేదు. అయితే ఈ సినిమాలో స్పెష‌ల్ ప్యాకేజీ ఉన్నమాట నిజ‌మే. అది మ‌హేషా..? ప్రభాసా? అనే విష‌యం మాత్రం తేల‌డం లేదు. ఒక‌వేళ‌..మ‌హేష్ కినిపించి, ప్రభాస్ గొంతు వినిపిస్తే మాత్రం అంద‌రికీ పండ‌గే. మరి ఈ క‌ల సాధ్యమైందా? లేదా? అనేది తెలుసుకోవాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.