మహేష్బాబు కథానాయకుడిగా ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘స్పైడర్’. తాజాగా విడుదలైన ఈ చిత్ర టీజర్ యూట్యూబ్ లో ట్రెండ్ సెట్ చేసింది.
గురువారం ఉదయం టీజర్ విడుదల కాగా.. 5 గంటల్లోనే 2 మిలియన్ వ్యూస్ని క్రాస్ చేయడమే కాకుండా 1.20 లక్షల లైక్లు సాధించింది. ప్రస్తుతం 50 లక్షల వ్యూస్కు దగ్గరై యూట్యూబ్ ట్రెండింగ్లో తొలిస్థానంలో ఉంది.
చిత్రానికి హారిస్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక. . మహేష్ బాబుతో రకుల్ ప్రీత్ సింగ్ కు ఇదే తొలి సినిమా. నేషనల్ అవార్డ్ విన్నర్ సంతోష్ శివన్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ పనిచేస్తున్నాడు. చిత్రాన్ని ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దర్శకుడు ఎస్.జె. సూర్య ఇందులో విలన్ రోల్ లో కనిపించడం విశేషం.