కథానాయకులు, నాయికలు అప్పుడప్పుడూ గొంతు సవరించుకోవడం మామూలే. మహేష్ బాబు కూడా.. బిజినెస్మేన్ సినిమా కోసం ఓ పాట పాడాడు. పాటంటే పాట కాదు.. ఓ పాటలో పూరితో కలసి గొంతు విప్పాడు. అందులో కొన్ని సంభాషణలు పలికాడు. ఆ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. ఈసారి ఎలాగైనా సరే.. మహేష్ చేత పూర్తిస్థాయి పాట పాడించాలని తహతహలాడుతున్నాడు. మహేష్ – శ్రీనువైట్ల కాంబినేషన్లో వస్తున్న ఆగడు చిత్రానికి తమనే సంగీత దర్శకుడు. ఈ సినిమాలో మహేష్తో పాట పాడించి, తన ఆల్బమ్కి మరింత క్రేజ్ తీసుకురావాలని తమన్ విశ్వప్రయత్నాలు చేస్తున్నాడట. ఈ విషయంలో మహేష్ని బలవంతం చేస్తున్నాడట. ఈ విషయాన్ని తమన్ స్వయంగా చెప్పాడు. ”మహేష్తో పాట పాడించాలనివుంది. ఈ విషయాన్ని మహేష్కి చాలాసార్లు చెప్పా. పాడాలా? వద్దా అని ఆలోచిస్తున్నారు. నేను మాత్రం పాడేంత వరకూ వదలను” అంటున్నాడు. మరి మహేష్ పాడతారంటారా..?? పాడితే… ఆగడు ఆల్బమ్ కెవ్వు కేకే..