Site icon TeluguMirchi.com

మహేష్‌ బాబు మూవీ చేతులు మారిందా?

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ప్రస్తుతం తన 26వ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’లో నటిస్తున్నాడు. అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఆ చిత్రం తర్వాత మహేష్‌బాబు నటించబోతున్న చిత్రంపై క్లారిటీ వచ్చేసింది. ‘గీతా గోవిందం’ వంటి బ్లాక్‌ బస్టర్‌ను దక్కించుకున్న దర్శకుడు పరుశురామ్‌ దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా ఒక చిత్రం రూపొందబోతుంది. ఈ చిత్రం గురించి చాలా రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. గీతాఆర్ట్స్‌ వారు ఈ కాంబోలో మూవీని నిర్మించేందుకు ముందుకు వచ్చారు. అందుకు సంబంధించిన చర్చలు కూడా జరిగాయి. కాని తాజాగా ఈ చిత్రం చేతులు మారిందని తెలుస్తోంది.

మహేష్‌బాబు, పరుశురామ్‌ల కాంబో మూవీని ప్రముఖ దర్శకుడు కొరటాల శివ తన సన్నిహిత మిత్రుడితో కలిసి నిర్మించబోతున్నాడట. ఇప్పటికే మహేష్‌ బాబు నుండి డేట్లు తీసుకున్న కొరటాల శివ ఈ ఏడాది చివర్లో సినిమాను మొదలు పెట్టబోతున్నాడు. మరో వైపు కొరటాల తన తదుపరి చిత్రంను చిరంజీవితో చేసేందుకు సిద్దంగా ఉన్న విషయం తెల్సిందే. మరి కొన్ని రోజుల్లోనే చిరంజీవి హీరోగా కొరటాల మూవీ ప్రారంభం కాబోతుంది. ఒక వైపు దర్శకుడిగా కొనసాగుతూనే మరో వైపు నిర్మాతగా సూపర్‌ స్టార్‌తో సినిమాను నిర్మించడం అంటే మామూలు విషయం కాదు. కొరటాల శివ ఈ రెండు సినిమాలను ఎలా బ్యాలన్స్‌ చేస్తాడో చూడాలి.

Exit mobile version