తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మహేష్..

సూపర్ స్టార్ మహేష్ బాబు శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మహేష్ నటించిన భరత్ అనే నేను చిత్రం సూపర్ హిట్ కావడం తో మహేష్ బాబు తో పాటు డైరెక్టర్ కొరటాల శివ స్వామి వారిని దర్శించుకున్నారు. వీరితో పాటు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ కూడా ఉన్నారు. మహేష్ బాబు ను చూసేందుకు భక్తులు పోటీపడ్డారు.

ఈ సందర్భంగా మహేశ్‌ మాట్లాడుతూ..నా జీవితంలో ఇది చాలా ఆనందకరమైన రోజు అని చెప్పారు. స్వామి వారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ..భరత్‌ అనే నేను చిత్రం భారీ విజయం సాధించిందని, అందుకనే శ్రీవారికి మొక్కు చెల్లించుకోవడానికి వచ్చామని తెలిపారు.

నిన్న విజవాడ కనక దుర్గమ్మ ను దర్శించుకొని మొక్కు చెల్లించుకున్నారు. ఆ తర్వాత తిరుపతి లో ఏర్పటు చేసిన చిత్ర సక్సెస్ మీట్ లో మహేష్ పాల్గొన్నాడు.