దుర్గమ్మ ను దర్శించుకున్న మహేష్ బాబు..

సూపర్ స్టార్ మహేష్ బాబు విజయవాడ కనక దుర్గమ్మ ను దర్శించుకున్నారు. భరత్ అనే నేను సూపర్ హిట్ కావడం తో డైరెక్టర్ కొరటాల శివ తో కలిసి మహేష్ ఈరోజు ఉదయం విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. వీరితో పాటు మహేశ్ బావ, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కూడా కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. మహేశ్ బాబు దుర్గమ్మ దర్శనానికి వస్తున్నారని తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున ఆలయానైకి చేరుకున్నారు.

దర్శనం అనంతరం చిత్ర యూనిట్ గవర్నర్ పేటలోని అన్నపూర్ణ థియేటర్‌కు వెళ్లారు. దీంతో థియేటర్ దగ్గరకు ఫ్యాన్స్ భారీగా చేరుకున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు బెంజిసర్కిల్లోని ట్రెండ్‌సెట్‌ మాల్‌ (క్యాపిటల్‌ సినిమాస్‌)లో మహేశ్ బాబు అభిమానులను కలుసుకుంటారు. ఆ తర్వాత మీడియా సమావేశం లో మహేష్ పాల్గొనబోతాడు.