మహేష్ ది ఎప్పుడూ దూకుడే!

maheshbabuమహేష్ బాబు నిర్ణయాలు సినిమాల ఎంపిక విషయంలో అయితే ఆచితూచి ఉంటాయి కానీ, అభిమానులకు ఏదైనా అందించే విషయంలో మాత్రం దూకుడుగానే ఉంటాయంటారు. దీనికి ఇప్పుడు తన తాజా చిత్రం “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” ప్రీమియర్‌ షో యే చక్కని ఉదాహరణ అంటున్నారు తన అభిమానగణం. సాధారణంగా అభిమానుల కోసం మామూలు కంటే కాస్త ముందుగా ప్రీమియర్‌ షోలు ఏర్పాటు చేయడం ఆనవాయితీ. అయితే ఇవి ఏ హైదరాబాద్‌ లోనో, అమెరికాలోనో లేదంటే తిరుపతిలోనో మాత్రమే ప్రదర్శించబడతాయి. అవి అక్కడి అభిమానులకే అందుబాటులో ఉంటాయి. మరి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నా వారి మాటేమిటీ? ఇదే అనుమానం మహేష్ కి వచ్చినట్టుంది. అందుకే బాగా ఆలోచించి ఓ బ్రహ్మాండమైన నిర్ణయం తీసుకున్నట్టు వినికిడి. తన తాజా చిత్రం “సీతమ్మ వాకిట్లో…..” జనవరి 11న విడుదలవుతోంది కాబట్టి ఒకరోజు ముందుగానే అంటే జనవరి 10వ తేదీ అర్ధ్రాత్రి అభిమానుల కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రీమియర్‌ షోలు ఆడించాలని నిర్మాత దిల్‌ రాజుకు చెప్పాడట మహేష్. దీనివల్ల కోటి రూపాయలకు పైగా కలెక్ట్‌ అవుతుందని అంచనా వేసిన దిల్‌ రాజు దీనికి ఠకీమని ఒప్పేసుకున్నాడని సమాచారం. ఒకవేళ ఇది క్లిక్‌ అయిపోయిందంటే పెద్ద హీరోలంతా మహేష్ ఐడియాను ఫాలో అయిపోవడం గ్యారెంటీ అని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.