మొత్తానికి ఎవడు డేట్ ఫిక్సయ్యింది. జులై 31న బాక్సాఫీసు దగ్గర రామ్ చరణ్ ‘ఎవడు’ ఢీ కొట్టబోతున్నాడు. ఆ రోజుకి ఓ ప్రత్యేకత ఉంది. రామ్ చరణ్ కెరీర్ లో మైలురాయిగా నిలిచిన… మగధీర ఆ రోజే విడుదలైంది. ఆ సెంటిమెంట్ ‘ఎవడు’ కూడా కొనసాగిస్తుందని చిత్ర బృందం గట్టిగా నమ్మతోంది. పవన్ సినిమా ‘అత్తారింటికి దారేది’ ఆగస్టు 9న వస్తున్న నేపథ్యంలో – ఎవడు రిలీజ్ డేట్ పై కాస్త సందిగ్థం నెలకొంది. పవన్ సినిమాకి భయపడి చరణ్ వెనుకంజ వేస్తాడని చెప్పుకొన్నారు. అయితే… ఎవడు టీమ్ మాత్రం ధైర్యం చేసింది. సాధారణంగా తెలుగు సినిమాలు శుక్రవారం విడుదలవుతాయి. కానీ ఎవడు మాత్రం బుధవారం తీసుకెళ్లారు. అది కూడా ఓ స్ట్రాటజీనే. తొలి రెండు రోజులూ ఎలాగూ వసూళ్లు భారీగా ఉంటాయి. ఆ తరవాత వీకెండ్ మొదలవుతుంది. శని, ఆది కూడా హౌస్ ఫుల్స్ ఖాయం. సినిమా ఎలాగున్నా బుధ, గురు, శుక్ర, శని, ఆది వారాల్లో డబ్బులు వసూలు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. కాబట్టి ఎవడు సేఫ్ జోన్ లో పడిపోతుంది. ఇక ఏమాత్రం బాగున్నా – దుమ్ము దులపడం ఖాయం. అత్తారింటికి.. వచ్చేలోగా సొమ్ములు చేసుకొని సైడ్ అయిపోవచ్చు. అదీ దిల్ రాజు ప్లాన్!! మొత్తానికి ఎవడు కూడా కాసులు కురిపించే సినిమాగా నిలవడం గ్యారెంటీ.