అక్కినేని క్యాంపులో ఆనందోత్సాహాలను నింపిన చిత్రం ‘తడాఖా’. శుక్రవారం విడదులైన ఈ చిత్రం మంచి వసూళ్లు సాధించి.. విజయం వైపుకు దూసుకెళ్తోంది. తడాఖా విజయోత్సవ సభ… మంగళవారం ఉదయం హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ వేడుకలో చైతన్య మాట్లాడుతూ ”నన్ను మాస్ హీరోగా నిలబెట్టిన సినిమా ఇది. చైతూ ఇలాంటి పాత్రలు కూడా చేయగలడు.. అనే భరోసా కల్పించింది. నా గత సినిమాలకు రానన్ని వసూళ్లు ఈ సినిమాకు వస్తున్నాయి. సునీల్ అందించిన సహకారం ఎప్పటికీ మర్చిపోలేను” అని చెప్పాడు. ఈ కార్యక్రమంలో సునీల్, బెల్లంకొండ సురేష్, తమన్, డాలీ పాల్గొన్నారు.