ఇప్పటికే సమంత, శ్రియలతో మనం సినిమా అందంగా ముస్తాబయ్యింది. ఈలోగా మరో కథానాయిక కూడా ఈ సినిమాలో కనిపించబోతోందని తెలసింది. ఆ అమ్మాయి ఎవరో కాదు. అందాల రాక్షసి తో ఆకట్టుకొన్న లావణ్యా త్రిపాఠీ. ఆతరవాత దూసుకెళ్తాలో మంచు విష్ణు పక్కన నటించింది. ఇప్పుడిది మూడో సినిమా. అయితే ఇందులో లావణ్య కథానాయిక కాదట. ఓ కీలకమైన పాత్రలో కనిపిస్తుందట. నాగచైతన్య, లావణ్యలపై కొన్ని సన్నివేశాలున్నాయట. హీరోయిన్గా అవకాశాలు సాధించుకోవాల్సిన తరుణంలో మరీ గెస్ట్ రోల్ ఎలా ఒప్పుకొందో అర్థం కావడం లేదు. ఈనెల 23న మనం విడుదల కాబోతోంది. లావణ్య ముచ్చటపడి మరీ చేసిన ఆ పాత్రేమిటో తెలియాలంటే అప్పటి వరకూ ఆగాల్సిందే.