తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ.. ఇలా అన్నిభాషల సినిమాల్లో నటించి శిఖర స్థాయికి ఎదిగిన శ్రీదేవి ఆకస్మిక మరణం తట్టుకోలేకపోతోంది యావత్ సినీలోకం. శ్రీదేవి గుర్తులను తలచుకుంటూ బాధలో మునిగిపోయారంతా. ఐతే ఢిల్లీ మీడియా శ్రీదేవి మృతిపై పక్షపాతం చుపించిందని హీరోయిన్ కుష్బూ. దేశ రాజధాని దిల్లీకి చెందిన వార్తా పత్రికల్లో మాత్రం అసలు శ్రీదేవి నటించిన తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ సినిమాల జాడే కన్పించలేదు.
దీనిపై కుష్బూ మాట్లాడుతూ.. దిల్లీకి చెందిన ఏ వార్తా పత్రికలో శ్రీదేవి నటించిన తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ సినిమాల గురించి ఒక్క వార్త కూడా రాయలేదు. ఇది నిజంగా బాధాకరం. ఈ నాలుగు భాషల్లో ఆమె సూపర్స్టార్గా పేరుతెచ్చుకున్నాకే బాలీవుడ్కు వెళ్లారు.’అన్నారు కుష్బూ