రూమర్స్ ను ఒంటిపై సబ్బుతో పోల్చిన హీరోయిన్


తనపై వస్తున్న రూమర్స్ పై హీరోయిన్ కృతిసనన్‌ వెరైటీగా స్పదించింది. అవి తను రోజూ వాడే సబ్బులాంటివే అని కొట్టిపారేస్తోంది కృతి. కృతిసనన్‌ ‘రాబ్తా’లో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌తో కలిసి నటిస్తోంది. ఈ చిత్రం ఈ ఇద్దరి మధ్య ప్రేమ కథకు బీజం వేసిందని బాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది.

వీటిపై తాజగా స్పదించింది. ‘‘నేను చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టకముందే ఇలాంటి కల్పిత కథలు విన్నాను. ఇప్పుడు నా విషయంలోనూ అదే జరిగింది. అందుకే వాటి గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు.మేమూ మనుషులమే. మాకూ కుటుంబం ఉంటుంది. కానీ కొందరు పనిగట్టుకొని ఇలాంటి వార్తల్ని పుట్టిస్తుంటారు. ఇవేవీ నా వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేయలేవు. అవి తను రోజూ వాడే సబ్బులాంటివే ” అని లైట్ తీసుకుంది కృతి