మెగా స్టార్ చిరంజీవి 150వ సినిమా విడుదలకు సిద్దం అవుతోంది. ఈ సంక్రాంతి కానుకాగా బాక్సాఫీసు ముందుకు వస్తోంది ఖైదీ నెం.150. ఈ సినిమా తర్వాత చిరు చేయబోయే సినిమాపై కూడా ఇదివరకే వార్తలు వచ్చాయి. బోయపాటి శ్రీను, సురేందర్ పేరు వినిపించాయి.
సురేందర్ రెడ్డి దగ్గర కథ రెడీగావుందని.. అలాగే బోయపాటి ఇది వరకే చిరు కోసం ఓ కథ సిద్ధం చేశాడని కధనాలు వినిపించాయి. బోయపాటి, లేదంటే… సురేందర్ రెడ్డి.. వీరిద్దరిలో ఒకరితో చిరు 151వ సినిమా చేయడం ఖాయమనుకొన్నారు.
అయితే ఇప్పుడు సడన్ గా మరో దర్శకుడు లైన్ లోకి వచ్చాడు. అతడే క్రిష్. ఇటీవల రామ్ చరణ్, క్రిష్ ఇద్దరూ కలసి చిరు 151వ సినిమా గురించి మంతనాలు జరిపినట్టు భోగట్టా. దాదాపు ఇదే వీరి కలయికే సెట్స్ పైకి వెళ్లనుందని టాక్. మొదట చరణ్ హీరోగా జగదీక వీరుడు రిమేక్ అనుకున్నా.. ఇప్పుడు క్రిష్ మాత్రం చిరు హీరోగా సినిమా చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.