కొరటాల ఆవేదన..

Koratala-Avedanaఓ పక్క శ్రీమంతుడు చిత్రం సూపర్ సక్సెస్ ని చిత్ర యూనిట్ ఎంజాయ్ చేస్తుంటే, పాపం చిత్ర దర్శకుడు కొరటాల శివ మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు..ఇంతకి కొరటాల కు వచ్చిన కష్టం ఏంటో మీరే చూడండి..

భద్ర ,తులసి ,సింహా ,బృందావనం వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు కథ అందించిన కొరటాల శివ అన్న సంగతి మిర్చి చిత్రం రిలీజ్ అయ్యే వరకు తక్కువ మందికే తెలుసు..ఆ చిత్ర హిట్ తర్వాతే శివ కు గుర్తింపు వచ్చింది.అందుకనే
రచయితలకు గౌరవం దక్కాలని వారికి డబ్బు కన్నా గౌరవం ప్రధానమని తన ఆవేదన వ్యక్తం చేసాడు. తము రచనా సహకారం అందించిన చిత్రాలు సూపర్ హిట్ అయిన కానీ రచయితలకు సరైన గుర్తింపు దక్కడం లేదని వాళ్ళ సృజనాత్మకతని కొంతమంది దొంగిలిస్తున్నారని ,వాళ్ళకు గౌరవం లభించినప్పుడే మంచి మంచి కథలు వస్తాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దర్శకులు కొరటాల శివ . కొరటాల ఆవేదన వెనుక ఎన్ని కష్టాలు పడ్డాడో మనం అర్ధం చేసుకోవచ్చు.