ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు నిరాశ తప్పదు..

ఎన్టీఆర్ అభిమానులకు చేదు వార్త ..మొన్నటి వరకు రాజమౌళి డైరెక్షన్లో చేస్తున్న ఆర్ఆర్ఆర్ పూర్తీ కాగానే ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్లో సినిమా చేస్తాడని మొన్నటి వరకు తెగ ప్రచారం అయ్యింది. కానీ ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం మేరకు కొరటాలతో కాకుండా కేజీఎఫ్ లాంటి సినిమాను తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సినిమా చేయాలనీ ఫిక్స్ అయ్యాడట. అలాగే త్రివిక్రమ్ డైరెక్షన్లోనూ హారిక-హాసిని బ్యానర్ లో సినిమా చేయాలనీ డిసైడ్ అయ్యాడట.

ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత కొరటాల మూవీ చేయాలనీ అనుకుంటున్నాడట. అంటే మరో రెండు , మూడేళ్ల తర్వాత కానీ ఎన్టీఆర్ – కొరటాల కాంబో లో సినిమా రాదు. వీరిద్దరి కాంబో లో వచ్చిన జనతా గ్యారేజ్ పెద్ద హిట్ కావడం తో అభిమానులు వీరి కాంబో మూవీ కోసం కాస్త ఎక్కువగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వీరిద్దరి కాంబో లో సినిమా లేదంటే వారు తట్టుకోలేకపోతున్నారు. చూద్దాం ఏమైనా మార్పులు జరిగి కొరటాల మూవీ ఓకే అవుతాదేమో…