అవును జులై 19 న మాములు సునామీ కాదు..బర్నింగ్ సునామే..ఎందుకంటే ఆ రోజు సంపూ కొబ్బరి మట్ట తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కేవలం సోషల్ మీడియా ను నమ్ముకొని ఎనలేని క్రేజ్ తెచ్చుకున్న నటుడు సంపూర్ణేష్ బాబు. హృదయ కాలేయం చిత్రం తో హీరోగా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన ఈయన ఆ తర్వాత పలు క్యారెక్టర్ రోల్స్ లలో సైతం నటించి ప్రేక్షకులను అలరించారు.
కాస్త గ్యాప్ తర్వాత ఈయన కొబ్బరిమట్ట చిత్రంతో జులై 19 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ఏడాది పైగానే అవుతుంది. కానీ విడుదల మాత్రం నోచుకోలేదు. దీనికి కారణాలు ఏంటో కరెక్ట్ గా తెలియదు కానీ ప్రస్తుతం ఈ మూవీను జులై 19 న విడుదల చేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. ఈ చిత్రంలో సంపూ అండ్రాయిడ్ పాత్రతో పాటు ఇంకో రెండు పాత్రలు కూడా చేస్తున్నాడు. ఒకటి పాపారాయుడు.. ఇంకోటి పెదరాయుడు. సంపూ తొలి సినిమాను రూపొందించిన స్టీఫెన్ శంకర్ ఈ చిత్రానికి కథ.. మాటలు అందించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. రొనాల్డ్ రూపక్ సన్ దర్శకుడు.