ఓమ్ సినిమాపై కల్యాణ్రామ్ భారీ ఆశలే పెంచుకొంటున్నాడు. తప్పకుండా ఈ సినిమాతో తన కెరీర్ మారుతుంది అని ధీమాగా చెబుతున్నాడు. త్రీడీ సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కించిన సినిమా ఇది. రూ. 25 కోట్లు ఖర్చుపెట్టాడు. సునీల్ వర్మకు దర్శకుడిగా ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమాని ఇటీవల రజనీకాంత్కి ప్రత్యేకంగా చూపించారు. ఆయన స్పందన కల్యాణ్రామ్కి మరింత నమ్మకాన్ని కలిగించింది. ”సినిమా అంటే నాకు చాలా ఫ్యాషన్. నాకు తెలిసింది రెండే రెండు. ఒకటి సినిమా, రెండు కుటుంబం. ఏం చేసినా సినిమాల్లోనే. అందుకే ఎంత రిస్క్ అయినా నా సినిమాల్ని నేను తీసుకొంటున్నా. నా ఫ్యాషన్తో ఇతరుల్ని ఇబ్బంది పెట్టలేను” అంటున్నాడు కల్యాణ్రామ్.
ఓమ్ సినిమా గురించి చెబుతూ ”కథ, స్ర్కీన్ప్లే, సాంకేతికత ఇలా అన్ని అంశాల్లోనూ కొత్తదనం కనిపిస్తుంది. త్రీడీ కోసం చాలా కష్టపడ్డాం. విదేశీ నిపుణులు ఈ సినిమా కోసం పనిచేశారు. అన్ని విధాలా సంతృప్తినిచ్చిన అవుట్పుట్ ఇచ్చారు. ఈ సినిమాతో నా కెరీర్ తప్పకుండా మారుతుంది. కల్యాణ్రామ్ సినిమా అంటే ఏదో ఓ కొత్తదనం ఆశిస్తున్నారు. దాని కోసమే ఆలస్యం అవుతోంది. ఇక మీదట వేగంగా సినిమాలు తీస్తా..” అని చెబుతున్నాడీ నందమూరి హీరో. ఈనెల 19న ఓమ్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.