కిరణ్‌ అబ్బవరం ‘మీటర్‌’ తో ఏప్రిల్‌ 7న వస్తున్నాడు !


వైవిధ్యమైన కథలు, విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ హీరోగా తనకంటూ ఓ మార్క్‌ను క్రియేట్‌ చేసుకున్న యంగ్‌ టాలెంటెడ్‌ కథానాయకుడు కిరణ్‌ అబ్బవరం. ఇటీవల ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రంతో విజయాన్ని అందుకున్న ఈ యువ హీరో నటిస్తున్న పక్కా మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ‘మీటర్‌’. టాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన మైత్రీ మూవీ మేకర్స్‌ సమర్పణలో, పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై చిరంజీవి (చెర్రి), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రమేష్‌ కాదూరి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

కాగా ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 7న వేసవిలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు నిర్మాతలు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘‘ కిరణ్‌ అబ్బవరంతో నిర్మిస్తున్న పక్కా కమర్షియల్‌ సినిమా ఇది. ఈ చిత్రంలో కిరణ్‌ అబ్బవరం పవర్‌ఫుల్‌ పోలీస్‌ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. ఆయన లుక్‌, పాత్ర అన్ని కొత్తగా వుంటాయి. ఆయన కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో నిర్మించిన చిత్రమిది. ఏప్రిల్‌ 7న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’ అన్నారు.

అతుల్య రవి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సాయి కార్తీక్‌ సంగీతం అందించగా, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం రమేష్‌ కాదూరి అందించారు.