దాదాపు తొమ్మిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రంపై విపరీతమైన అంచనాలున్నాయి. ఇది చిరంజీవి 150వ సినిమా కావడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. మెగా అభిమానుల్లోనే గాక తెలుగు సినీ ప్రేక్షకులందరిలోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు, ఆశలు ఉన్నాయి. ఎన్నో ఏళ్ల తరువాత మళ్ళీ తెర మీద మెగాస్టార్ ను చూడాలని అభిమానులు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఈ భారీ స్థాయి క్రేజ్ కారణంగా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ తారా స్థాయిలో జరుగుతుంది..
ఇప్పటికే ఈ చిత్రం యొక్క ఆంధ్రా రైట్స్ రూ. 32 కోట్ల భారీ ధరకు అమ్ముడవగా, తాజా ఈ చిత్రం యొక్క శాటిలైట్ రైట్స్ కూడా అదే స్థాయి ధరను పలికాయని సమాచారం..మా టీవీ సంస్థ చిరంజీవి స్టామినా ను దృష్టిలో పెట్టుకుని శాటిలైట్ రైట్స్ ను రూ. 14 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసిందట. ఇప్పటికే షూటింగ్ పూర్తి కావొస్తున్నా ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.